మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నేటి తెల్లవారుజామునుండే మున్సిపల్ కార్మికులు విధులకు హాజరయ్యారు. కాగా పలు డిమాండ్ల సాధనలో భాగంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగిన విషయం తెలిసిందే. దాంతో మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపేందుకు జగన్ ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కార్మిక సంఘాలకు మంత్రి వర్గ ఉపసంఘంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మున్సిపల్ కార్మికులు యథావిధిగా విధులకు హాజరయ్యారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్ల మేరకు వారికి […]