ప్రజారోగ్యానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, కంటి వెలుగు తదితర కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదలకు వైద్యం చేయిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రధానాస్పత్రుల్లో రూ.కోట్లతో సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కార్పొరేట్ ఆస్పత్రుల కంటే ధీటైన వైద్యసేవలు ఉచితంగా అందించేలా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నియోనేటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లు (ఎన్ఐసీయూ) మంజూరు చేశారు. గతంలో ఉన్న ఎన్ఐసీయూకు అదనంగా మరొకటి […]