రాష్ట్ర ప్రజలంతా వైభవంగా జరుపుకునే సంక్రాతి కానుకగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. నేటినుండి అనగా జనవరి 6 నుంచి 18 వరకూ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. కాగా స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. దీంతో ప్రయాణికుకులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ చార్జీల సాకుతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఏపీలో దశాబ్దాలపాటుగా పండుగల సమయంలో ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అధిక చార్జీలు […]