ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమీషన్ ముఖేష్ కుమార్ మీనా మీడియాకు వెళ్ళడించారు. తుది పోలింగ్ శాతం 80.66 గా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2 శాతం మొత్తం కలుపుకుని 81.86 శాతంగా పోలింగ్ శాతం నమోదైందని ఆయన ప్రకటించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే భారీగా నమోదైన పోలింగ్ శాతంగా ఆయన చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కన్నా ఇది 2 శాతం అధికంగా కనిపిస్తుంది. […]