‘నన్ను మంగళగిరిలో ఓడించేందుకు సీఎం జగన్ రూ.300 కోట్లు పంపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టాలి. మాయమాటలకు మోసపోవద్దు’ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాటలివి. శనివారం తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, ప్రాతూరు చర్చిసెంటర్, మెల్లెంపూడి మసీదు వద్ద నిర్వహించిన రచ్చబండ సభల్లో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను తాను అతిగా ఊహించుకుంటారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. […]