ఎన్నికల్లో తమ ఓటమి తథ్యమని గ్రహించిన తెలుగుదేశం పార్టీ ఇక చేసేది లేక ఓర్చుకోలేక ఏకంగా దాడులకి దిగిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు . చిత్తూరు జిల్లా పుంగనూరులో కత్తిపోట్లతో టీడీపీ నేతలు పోలింగ్ రోజును ప్రారంభించి ఎన్నికలు జరుగుతున్నంతసేపు రాష్ట్రంలో ఏదో ఒక మూలన అలజడులను సృష్టిస్తూనే ఉన్నారని, చంద్రబాబు డైరెక్షన్ లో ఎన్నికల ప్రక్రియనే పూర్తిగా అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించారని ఆయన […]