మహ్మద్ మసూద్ అజహర్ అల్వీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు ఇది. కరుగుగట్టిన ఉగ్రవాది. జైషే మహ్మద్ సంస్థ వ్యవస్థాపకుడు. పాకిస్తాన్లో పుట్టాడు.
భారతదేశంలో జరిగిన అనేక ఉగ్ర దాడులకు కారణం ఇతనే. తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు బాంబులు విసరడంతో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 1994లో అజర్ నకిలీ గుర్తింపుతో శ్రీనగర్కు వెళ్లాడు. అదే ఏడాది ఫిబ్రవరిలో అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మసూద్ విడుదల కోసం అతని మనుషులు 1999 సంవత్సరంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. అదే కాందహార్ హైజాక్గా పేరుపొందింది. ప్రయాణికుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆనాడు మసూద్ను విడుదల చేయాల్సి వచ్చింది.
ఇది జరిగింది 1999 డిసెంబర్ 31వ తేదీన. ఆ తర్వాత జైషే చీఫ్ ఎన్నో దారుణాలకు ఒడిగట్టాడు. 2001లో భారత పార్లమెంట్పై దాడి, 2008లో ముంబై నగరంలో బాంబు దాడులు, కాల్పులు, 2016లో పఠాన్కోట్ దాడులు, 2019లో పుల్వామా దాడులకు కారణం జైషే సంస్థే. దీంతో 2019లో మసూద్ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
మసూద్ విడుదలై 25 సంవత్సరాలైంది. వేలాదిమంది మృతికి కారణమైన అతడి ఊపిరి ఆగిపోయిందన్న వార్త న్యూ ఇయర్ రోజున ప్రజలకు ఫుల్ జోష్ ఇస్తోంది. దేశానికి ముప్పుగా ఉన్న వ్యక్తులు ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోతూ ఉన్నారు. మసూద్ మరణం కూడా అదే కోవ కిందకు వస్తుందా?. జైషే సంస్థ చేసిన ఎన్నో దాడులకు దేశం ప్రతికారం తీర్చుకుందా? అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. లేక పాక్లో అతనంటే గిట్టని వ్యక్తులు బాంబు విసిరి చంపారా?.. అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇది ప్రతీకారమైనా.. ఒకవేళ యాదృచ్చికంగా జరిగినా. ఈ ఉగ్రవాది చనిపోవడం మాత్రం ప్రపంచానికి ఎంతో మంచి చేసేదే.. ముఖ్యంగా మన దేశంలో జరిగిన దాడుల్లో అమరులైన వారి కుటుంబాలకు ఇది ఊరటనిచ్చే విషయం.