రాష్ట్రంలో మూడో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా టోఫెల్ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బుధవారం వెల్లడించారు. 13,104 పాఠశాలల్లో 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారని ప్రధానంగా గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరవడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. అదే విధంగా 5,907 పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతులు చదువుతున్న 16,52,142 మంది […]